నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగుడి
By Paul C. Jong
()
About this ebook
యేసుక్రీస్తు మనకు ఆయన స్వంత శరీరము మరియు రక్తం ద్వారా మనకు నిత్యజీవాన్ని ప్రసాదించాడు
సంఘము యేసు క్రీస్తు ఆదేశించిన రెండు ఆజ్ఞలను అనుసరిస్తుంది. ఒకటి బాప్తిస్మము మరియు మరొకటి పవిత్ర ప్రభువు బల్ల. ఈ సువార్త జ్ఞాపకార్థం, దాని రొట్టె మరియు ద్రాక్ష రసము ద్వారా వెల్లడి చేయబడిన సత్యం యొక్క సువార్తపై ధ్యానం చేయుటకు మేము ప్రభువు బల్లలో పాల్గొంటాము.
పవిత్ర ప్రభువుబల్ల ఆచరణలో, మేము యేసు శరీరానికి జ్ఞాపకార్థంగా రొట్టెను తీసుకుంటాము మరియు ఆయన రక్తానికి జ్ఞాపకార్థంగా ద్రాక్షారసము త్రాగుతాము. అలాగే, పవిత్ర ప్రభువు బల్ల యొక్క నిజమైన అర్థం ఏమిటంటే, యేసు మనలను లోక పాపాల నుండి రక్షించాడని మరియు ఆయన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణం ద్వారా మనకు నిత్యజీవాన్ని ఇచ్చాడనే సత్యంపై మన విశ్వాసాన్ని బలోపేతం చేయడం.
అయితే, సమస్య ఏమిటంటే, దాదాపు అందరు క్రైస్తవులు పవిత్ర ప్రభువు బల్లలో అధికారికంగా మాత్రమే పాల్గొంటారు, “నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.” (యోహాను 6:55) అనే మాటకు యేసు ఉద్దేశ్యం ఏమిటో కూడా గ్రహించకుండానే పాల్గొంటున్నారు. కాబట్టి, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో, ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగమని యేసు ఇచ్చిన ఆజ్ఞ యొక్క అర్థంపై మనం మరోసారి దృష్టి పెట్టాలి మరియు దానిని విశ్వసించాలి.
Related to నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగుడి
Related ebooks
నీ హృదయంలో గందరగోళం మరియు సూన్యత ఉంటే సత్య వెలుగును వెదకుము (I) (Telugu67) Rating: 0 out of 5 stars0 ratingsపాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14) Rating: 0 out of 5 stars0 ratingsపాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 4 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (II) (Telugu15) Rating: 0 out of 5 stars0 ratingsరోమాపత్రిక పుస్తకం మీద ఉన్న వ్యాఖ్యానం (I) (Telugu34) Rating: 0 out of 5 stars0 ratingsవారికి చెప్పండి Rating: 0 out of 5 stars0 ratingsకొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు Rating: 0 out of 5 stars0 ratingsమీరు క్రొత్తగా జన్మించుటకు మీ నుండి ఏమి అవసరం? Rating: 0 out of 5 stars0 ratingsనాలుగు సువార్తలలో నమోదుచేయబడిన యేసు మరియు బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యలో ఉన్న సంబంధం Rating: 0 out of 5 stars0 ratingsనూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు Rating: 2 out of 5 stars2/5తెలుగు స్పానిష్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - Reina Valera 1909 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు హంగేరియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - Karoli 1589 Rating: 0 out of 5 stars0 ratingsసంఘస్థాపన Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు తమిళ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - தமிழ் பைபிள் 1868 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు ఫ్రెంచ్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - La Sainte 1887 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు ఫినిష్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - Pyhä Raamattu 1938 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు స్లొవేకియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - Rohacek Slovakian 1936 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు ఇటాలియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - Riveduta Bibbia 1924 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు కొరియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - 한국의 거룩한 1910 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు స్పానిష్ బైబిల్ No2: తెలుగు బైబిల్ 1880 - Sagradas Escrituras 1569 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు ఫ్రెంచ్ బైబిల్ No2: తెలుగు బైబిల్ 1880 - Louis Segond 1910 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు రష్యన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - Синодального Перевода 1876 Rating: 0 out of 5 stars0 ratingsఅడుగు! పొందు!! స్వీకరించు!!! Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు ఇటాలియన్ బైబిల్ No2: తెలుగు బైబిల్ 1880 - Giovanni Diodati 1603 Rating: 0 out of 5 stars0 ratingsభ్రష్టత్వము Rating: 0 out of 5 stars0 ratingsయోహాను సువార్త Rating: 0 out of 5 stars0 ratingsపరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో Rating: 0 out of 5 stars0 ratingsబైబిల్ మెమోరిజషన్ హ్యాండ్ బుక్ Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు జర్మన్ బైబిల్ No2: తెలుగు బైబిల్ 1880 - Menge 1926 Rating: 0 out of 5 stars0 ratingsతెలుగు రొమేనియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - Cornilescu 1921 Rating: 0 out of 5 stars0 ratingsమీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు Rating: 0 out of 5 stars0 ratings
Reviews for నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగుడి
0 ratings0 reviews
Book preview
నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగుడి - Paul C. Jong
యోహాను సువార్తపై ప్రసంగములు (III)
నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగుడి
Copyright © 2023 ది న్యూ లైఫ్ మిషన్
అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. కాపీరైట్ ప్రచురణకర్త మరియు యజమానుల ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఈ ప్రచురణలోని ఏ భాగాన్ని పునరుత్పత్తి చేయలేము, తిరిగి పొందే వ్యవస్థలో నిల్వ చేయలేము, లేదా ఏ రూపంలోనైనా లేదా ఎలక్ట్రానిక్, మెకానికల్, ఫోటోకాపీ, రికార్డింగ్ లేదా ఇతరత్రా ప్రసారం చేయలేము.
ఈ పుస్తకంలో ఉపయోగించిన స్క్రిప్చర్ కొటేషన్స్ న్ (తెలుగు బైబిల్ సొసైటీ అఫ్ ఇండియా వర్సిన్) నుండి.
ISBN 978-89-282-3286-4
Design by Min-soo Kim
Illustration by Young-ae Kim
Printed in Korea
Hephzibah Publishing House
A Ministry of THE NEW LIFE MISSION
Seoul, Korea
♠ Website:https://www.nlmission.com
https://www.nlmission.com
https://www.nlmbookcafe.com
♠ E-mail:newlife@bjnewlife.org
Telugu_under.gifవిషయసూచిక
ముందుమాట
1. చాలా మందికి ఈ చిన్న రొట్టెలు మరియు చేపలు ఎలా సరిపోవునూ? (యోహాను 6:1-15)
2. దేవుడు నియమించిన వానియందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ (యోహాను 6:16-29)
3. నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి (యోహాను 6:16-40)
4. అత్మానుసారముగా జీవించడం (యోహాను 6:26-40)
5. ఈ భూమిపై అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి (యోహాను 6:26-59)
6. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో ఉన్న విశ్వాసం ద్వారా మనం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును భుజించాలి (యోహాను 6:28-58)
7. మనకు జీవాహారముగా మారిన యేసుక్రీస్తు (యోహాను 6:41-51)
8. మనం యేసు శరీరమును ఎలా తినగలం? (యోహాను 6:41-59)
9. మీ రక్షకునిగా పరలోకం నుండి దిగి వచ్చిన యేసును మీ హృదయంతో విశ్వసించండి (యోహాను 6:41-51)
10. యేసు మనకు నిజమైన నిత్యజీవాన్ని ఇచ్చాడు! (యోహాను 6:47-51)
11. సరైన విశ్వాసంతో పవిత్ర బల్లలో ఎలా పాల్గొనాలి (యోహాను 6:52-59)
12. మనకు జీవాహారమును ఇచ్చిన యేసు (యోహాను 6:54-63)
13. మీరు మీ కుటుంబ సభ్యులకు యేసు యొక్క శరీరమును మరియు రక్తమును గూర్చి బోధించాలి (యోహాను 6:51-56)
14. మనం దేని కొరకు జీవించాలి? (యోహాను 6:63-69)
15. మనము సత్యమును గూర్చిన సరైన జ్ఞానమును కలిగి ఉండాలి (యోహాను 6:60-71)
0Prefaceముందుమాట
క్రైస్తవ మతం యొక్క చరిత్రలో, పరిశుద్ధమైన ప్రభు బల్ల యొక్క వివరణపై ప్రేరేపించబడిన యూకారిస్ట్ వివాదం ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారాన్ని చూడలేదు. మరో మాటలో చెప్పాలంటే, ప్రభు బల్లలో ఉపయోగించే రొట్టె మరియు ద్రాక్షారసమును ఎలా చూస్తారనే దానిపై ఆధారపడి, ఈ క్రింది విధంగా అనేక పోటీ వాదనలు ఉన్నాయి:
1) పరివర్తనవాదం-కాథలిక్ సంఘము కలిగి ఉన్న స్థానం, పరిశుద్ధమైన ప్రభు బల్ల యొక్క రొట్టె మరియు ద్రాక్షారసము వాస్తవానికి యేసు క్రీస్తు యొక్క శరీరం మరియు రక్తంగా రూపాంతరం చెందాయని ఈ అభిప్రాయం వాదిస్తుంది.
2) సహజీవనవాదం-మార్టిన్ లూథర్చే సూచించబడిన దృక్పథం, పరిశుద్ధమైన ప్రభు బల్ల యొక్క రొట్టె మరియు ద్రాక్షారసములో యేసుక్రీస్తు వాస్తవానికి ఉన్నాడని ఈ అభిప్రాయం వాదిస్తుంది.
3) సూచనవాదం-స్విస్కు చెందిన ఉల్రిచ్ జ్వింగ్లీ దీనిని వాదించారు, పరిశుద్ధమైన ప్రభు బల్లను యేసుక్రీస్తు మరణానికి ప్రతీకాత్మక స్మారకంగా సూచిస్తుంది అని అభిప్రాయం.
4) యేసుక్రీస్తు యొక్క ఆధ్యాత్మిక ఉనికి గురించి కాల్విన్ యొక్క సిద్ధాంతం-ఈ అభిప్రాయం క్రీస్తు పరిశుద్ధమైన ప్రభు బల్ల యొక్క రొట్టె మరియు ద్రాక్షారసములో ఆధ్యాత్మికంగా ఉన్నాడని నమ్ముతుంది.
ఈ రోజు వరకు, క్రైస్తవులు తమ స్వంత ఆలోచనల ప్రకారం ఎటువంటి సంకోచం లేకుండా పై అభిప్రాయాలలో ఒకదానిని నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ, పైన పేర్కొన్న నాలుగు వాదనల్లో, కాథలిక్ సంఘముచే సూచించబడిన పరివర్తనవాదమును మినహాయించి, మిగిలిన మూడు వాదనలు వాస్తవానికి పరివర్తనవాదము యొక్క పాక్షిక మార్పుల కంటే కొంచెం ఎక్కువ. వాస్తవానికి, ఈ వాదనలన్నీ మానవ ఆలోచనల ప్రకారం చేసిన ఊహాజనిత భావనలు తప్ప మరేమీ కాదు, ఎందుకంటే వాటి మతవాదులు ప్రభువు తన ఉద్దేశ్యాన్ని ఇలా చెప్పినప్పుడు దానిని అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు, మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను
(యోహాను 6:53).
వేరే విధంగా చెప్పాలంటే, ఈ వివాదాలన్నీ ఖచ్చితంగా బయటపడ్డాయి, ఎందుకంటే యేసు తన శరీరమును తినమని మరియు ఆయన రక్తాన్ని త్రాగమని ఎందుకు చెప్పాడో వాటి మద్దతుదారులకు పూర్తిగా తెలియదు. ప్రభు రాత్రి భోజనములో, యేసు తన శిష్యులకు రొట్టె మరియు ద్రాక్షారసంతో తన శరీరమును మరియు రక్తాన్ని గుర్తుంచుకోవాలని చెప్పాడు, మరియు ఇక్కడ ఉన్న ఈ రొట్టె, బాప్తిస్మమిచ్చు యోహాను నుండి పొందిన బాప్తిస్మము ద్వారా యేసు ఈ లోక పాపములన్నింటినీ ఒకేసారి తీసుకున్నాడని సూచిస్తుంది, అయితే ద్రాక్షారసం అంటే క్రీస్తు మన స్థానంలో సిలువ వేయబడి తన రక్తాన్ని చిందించడం ద్వారా మన పాపముల శిక్షను అనుభవించాడని అర్ధం.
పరిశుద్ధమైన ప్రభు బల్లలో వ్యక్తీకరించబడిన యేసు యొక్క న్యాయమైన ప్రేమ మరియు రక్షణను మనం ఎప్పుడూ నిరర్ధకం చేయకూడదు. ఆయన శరీరమును తిని, ఆయన రక్తాన్ని త్రాగమని, విశ్వాసంతో పరిశుద్ధమైన ప్రభు బల్లలో పాలుపంచుకోవాలని ఆజ్ఞాపించడంలో ప్రభువు ఉద్దేశాన్ని మనమందరం ఇప్పుడు మరోసారి ఆలోచించాలి. రక్షణకు సాక్షిగా ఉండే పరిశుద్ధమైన ప్రభు బల్లలో మనం పాలుపంచుకున్నప్పుడు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో మన పాపాలన్నింటినీ తుడిచిపెట్టిన దేవుని నీతిని గురించిన సరైన అవగాహనను కలిగి ఉండాలి మరియు ఈ నీతిని విశ్వసించాలి.
మళ్లీ చెప్పాలంటే, మీరు పరివర్తనవాదం వంటి సిద్ధాంతాలను విశ్వసిస్తూ ప్రభు బల్లలో పాల్గొంటే, మీ విశ్వాసం చాలా తప్పు అని సూచించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. యేసు ఇలా చెప్పాడు, మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను
(యోహాను 6:53), అయితే రొట్టె మరియు ద్రాక్షారసం నుండి రహస్యంగా రూపాంతరం చెందిన యేసు శరీరమును మరియు రక్తాన్ని అక్షరాలా తిని త్రాగడానికి మనం పరిశుద్ధమైన ప్రభు బల్లను ఆచరించాలని దీని అర్థమా? వేదాంతవేత్తల ప్రకారం, మనం ప్రభు బల్లను ఆచరించినప్పుడు, యేసుక్రీస్తు నిజానికి దాని రొట్టె మరియు ద్రాక్షారసములో ఉంటాడు, కాబట్టి ఈ రొట్టె తినడం మరియు ద్రాక్షారసము తాగడం ద్వారా, మనం యేసు శరీరమును తింటాము మరియు ఆయన రక్తాన్ని తాగుతాము. ఇదే జరిగితే, మనం ప్రభు బల్లలో పాల్గొంటే తప్ప, మనం యేసు శరీరమును తినలేము లేదా ఆయన రక్తాన్ని త్రాగలేము అని కూడా దీని అర్థం. అయితే, అటువంటి వాదన పూర్తిగా అర్ధంలేనిది. ఇది సత్యం నుండి విచలనం. యేసు చెప్పినది ఇదేనా?
నిజంగా ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగాలంటే మనం ప్రభు బల్లను నిర్వహించాలని ఆయన చెప్పాడా? లేదు, ఆయన ఇలా ఎప్పుడూ చెప్పలేదు. దేవుని వాక్యాన్ని విశ్వసించడం ద్వారా మనం మన పాపముల నుండి రక్షింపబడతాము మరియు నిత్యజీవాన్ని పొందుతాము. నిజంగా మనం ప్రభు బల్ల ఆచరించినప్పుడు మాత్రమే యేసు శరీరమును తిని, ఆయన రక్తాన్ని తాగితే, ఆయన శరీరమును మరియు రక్తాన్ని మనం పొందలేకపోతే, మన విశ్వాసం మన స్వంత క్రియలతో ఏర్పడుతుందని దీని అర్థం కాదా? ఇలా తప్పుగా బోధించే ఎవరైనా యేసు ద్వారా తీర్పు తీర్చబడతారు.
మనం నిజంగా యేసు శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగాలంటే, ఇది కేవలం పరిశుద్ధమైన ప్రభు బల్లలో పాల్గొనడం ద్వారా సాధించబడదు. ఈ భూమిపై యేసు తన 33 సంవత్సరాల జీవితంలో ఏమి చేసాడో విశ్వసించడం ద్వారా మనం ఆయన శరీరమును తినవచ్చు మరియు ఆయన రక్తాన్ని త్రాగవచ్చు. యేసు ఈ భూమిపైకి వచ్చినప్పుడు, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న మన పాపములన్నిటినీ, మరియు ఈ పాపముల కొరకు వాటి శాపాలన్నిటినీ ఆయన తనపైకి తీసుకున్నాడు. ఈ విధంగా మన పాపములను తన శరీరంపై భుజాన వేసుకునేందుకే, పాపం తెలియని దేవుడే, మనలాగే అదే శరీరంలో అవతరించాడు మరియు బాప్తిస్మము పొందడం ద్వారా ఈ లోకములోని ప్రతి పాపమును ఒకేసారి చేతులు వేయబడడం ద్వారా అంగీకరించాడు. ఇది దేవుని నీతిని నెరవేర్చడానికి సమర్పించబడిన యేసు శరీరం. యేసు యొక్క బాప్తిస్మము ద్వారా మన పాపములు ఆయన శరీరానికి చేరాయని నమ్మడం ద్వారా, మనం ఆయన శరీరమును తినాలి. ఈ విశ్వాసం ద్వారానే మనం యేసు శరీరమును తింటాము. మరియు యేసు ఈ పాపములను సిలువపైకి తీసుకువెళ్లాడని మరియు మన స్థానంలో శిక్షించబడ్డాడని నమ్మడం ద్వారా మనము ఆయన రక్తాన్ని త్రాగుతాము, ఎందుకంటే ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను చేత బాప్తిస్మము పొందడం ద్వారా లోక పాపములను తీసుకున్నాడు.
ఇప్పటి వరకు, చాలా మంది క్రైస్తవులకు సత్యం తెలియదు, కానీ మతపరమైన కార్యములను మాత్రమే వారసత్వంగా పొందారు. సువార్త నుండి పరిశుద్ధమైన ప్రభు బల్ల వరకు, నేటి క్రైస్తవ మతం తన సనాతన ధర్మాన్ని సత్యం యొక్క జ్ఞానం ద్వారా కాకుండా, అధికారిక విధానాలు మరియు పరిశుద్ధమైన ఆచారాలను మాత్రమే నొక్కి చెబుతుంది. తత్ఫలితంగా, నేటి క్రైస్తవులు ప్రభు బల్ల సమయంలో యేసు యొక్క శరీరమును మరియు రక్తాన్ని సూచించే రొట్టె మరియు ద్రాక్షారసాన్ని చూసినప్పుడు, వారు ఆయన రక్తాన్ని త్యాగం చేసినందుకు మాత్రమే కృతజ్ఞతలు తెలుపుతారు కానీ బాప్తిస్మమిచ్చు యోహాను చేత బాప్తిస్మము పొందడం ద్వారా క్రీస్తు వారి పాపములన్నిటినీ ఒక్కసారిగా తనపైకి తీసుకున్నాడనే వాస్తవం గురించి పూర్తిగా తెలియకుండా అలానే ఉన్నారు. కావున, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో యేసు యొక్క శరీరము మరియు రక్తము అంటే ఏమిటో ఇప్పటినుండియైనా నేర్చుకొని, దానిని విశ్వసించి, తద్వారా వారి రక్షణను పొంది, సరైన విశ్వాసంతో పరిశుద్ధమైన ప్రభు బల్లలో కూడా పాలుపంచుకోవాలని నేను లోకవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ఉపదేశిస్తున్నాను.
నేను మీ విశ్వాసాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించడం లేదని, మీ తప్పులను సరిదిద్దడానికి మరియు మీ విశ్వాసాన్ని సరిగ్గా స్థాపించడానికి ప్రయత్నిస్తున్నానని నేను ఇక్కడ స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రొటెస్టంట్లు, కాథలిక్కులు మరియు లోకవ్యాప్తంగా యేసును విశ్వసించే ప్రతి ఒక్కరూ నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యంలో యేసు యొక్క శరీరమును మరియు రక్తాన్ని సరిగ్గా అర్థం చేసుకొని విశ్వసించి తద్వారా నిత్య జీవములో ఆనందించాలని నా హృదయపూర్వక ఆశ మరియు ప్రార్థన.
దేవుని ఆశీర్వాదములు మీ అందరికీ కలుగునుగాక.
రచయిత
Sermon01.gif01.jpgచాలా మందికి
ఈ చిన్న రొట్టెలు మరియు
చేపలు ఎలా సరిపోవునూ?
< యోహాను 6:1-15 >
"అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను. రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతోకూడ కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుట చూచి–వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను. అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ –ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను; వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను."
యోహాను సువార్త ఆరవ అధ్యాయం పూర్తిగా జీవాహారము గురించి వ్రాయబడినది.
యేసు తిబెరియ సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్ళినప్పుడు, చాలా మంది ఆయనను వెంబడించారని నేటి లేఖన వాక్యభాగములో వ్రాయబడింది. చాలా మంది ప్రజలు యేసును వెంబడించడానికి కారణం, రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను వారు చూశారు. యేసు కొండపైకి వెళ్లి తన శిష్యులతో కలిసి కూర్చున్నప్పుడు, ఈ గొప్ప సమూహం తన వైపుకు రావడం చూసి, వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను?
అప్పుడు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.
ఇంకొక శిష్యుడైన అంద్రెయ యేసుతో, ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని?
అనెను. ఫిలిప్పు మరియు అంద్రెయ ఇద్దరూ ఆ సమయంలోని వాస్తవ పరిస్థితి ఏమిటో యేసుకు వివరించారు. అయితే ఆ ప్రజలందరినీ పచ్చిక మీద కూర్చోబెట్టమని యేసు తన శిష్యులతో చెప్పాడు. ఆ చిన్నవాడు తెచ్చిన ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకుని, వాటిని ఆశీర్వదించి, అక్కడ కూర్చున్న వారందరికీ పంచాడు. ఆ సమయంలో 5,000 మంది పురుషులు మాత్రమే ఈ రొట్టెలు మరియు చేపలను తిన్నారు, స్త్రీలు మరియు పిల్లలను లెక్కించలేదు (మత్తయి 14:21; మార్కు 6:44).
ఈ అద్భుతం కారణంగా, అక్కడ గుమిగూడిన ప్రజలు యేసును తమ రాజుగా చేయడానికి ప్రయత్నించారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో రోమా సామ్రాజ్యం యొక్క వలస పాలనలో నివసిస్తున్నారు, కాబట్టి వారు భూమిని పండించినప్పటికీ, వారి పంటలో ఎక్కువ భాగం రోమా సామ్రాజ్యం ద్వారా మదింపు చేయబడిన పన్నుల కోసం తీసివేయబడినందున, వారు జీవించడానికి చాలా తక్కువ ధనము మాత్రమే ఉండేది. కాబట్టి యేసును తమ రాజుగా చేయడానికి ప్రయత్నించడం సర్వసాధారణం. వారు జీవించడానికి తమను తాము పోషించుకోలేరు కాబట్టి, వారు రోగములకు గురైనప్పుడు ఎటువంటి చికిత్సలు పొందేందుకు వారి వద్ద డబ్బు లేదు, అందుకే వారు తమ వ్యాధులను నయం చేసి వారికి ఆహారం సమృద్దిగా ఇచ్చిన యేసును చాలా దగ్గరగా వెంబడించారు.
యోహాను సువార్త ఆరవ అధ్యాయంలో ప్రస్తావించబడిన జీవాహారము యేసు శరీరమును సూచిస్తుంది
యేసు బాప్తిస్మము పొందడం ద్వారా యేసు మన పాపములను తన శరీరంపై మోసాడని, సిలువ వేయబడడానికి తన శరీరాన్ని అప్పగించాడని, మరణమగునంతగా తన రక్తాన్ని చిందించాడని, మృతులలో నుండి తిరిగి లేచి, తద్వారా మన నిజమైన రక్షకుడయ్యాడని యేసు శరీరము సూచిస్తుంది. మన పాపములను ఒకేసారి తన శరీరంపైకి తీసుకొని, ఈ పాపముల శిక్షను ఒకేసారి భరించడం ద్వారా, యేసు మన పాపములన్నిటి నుండి మనలను సంపూర్ణంగా రక్షించాడు. యేసు శరీరమే జీవాహారము.
మరియు యేసు రక్తమే నిజమైన పానీయం. ఒక నిర్దిష్ట దృక్కోణం నుండి, బైబిల్ ఇశ్రాయేలు ప్రజల చరిత్ర తప్ప మరేమీ అనిపించకపోవచ్చు, కానీ వాస్తవానికి, జీవం పోయడానికి దేవుడు మొత్తం మానవ జాతికి ఇచ్చిన యేసు శరీరము మరియు రక్తాన్ని గురించి వ్రాసిన దేవుని వాక్యం. బైబిల్లోని ప్రతి అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న జీవ వాక్యం ఉంది. కాబట్టి దేవుని వాక్యం తనకు ఏమి చెబుతుందో ఎవరికైనా ఖచ్చితమైన జ్ఞానం ఉంటే, అతను తన పాపములన్నిటి నుండి రక్షించబడగలడు.
అంద్రెయ యేసుతో, ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని?
అన్నాడు. ఇక్కడ ఉన్న రెండు చిన్న చేపలు దేవుని సంఘమును సూచిస్తాయి. ఈ చేపల మాదిరిగానే, దేవుని సంఘము కూడా దాని బాహ్య రూపంలో ఆకట్టుకోలేదు. ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు ఈ భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను బోధించేది దేవుని సంఘము. మనం ఇప్పుడు వ్యాప్తి చేస్తున్న నీరు మరియు ఆత్మ యొక్క సువార్తకు ధన్యవాదాలు, దానివలన ఈ యుగంలో చాలా మంది ప్రజలు యేసు శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగగలుగుతున్నారు. మేము ఈ నిజమైన సువార్తను లోకములోని మొత్తం జనాభాతో పంచుకుంటున్నాము, ఈ లోకములో నివసిస్తున్న 6 వందల కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలలో, ఈ సువార్తను విశ్వసించే వారు తమ పాపముల నుండి విముక్తిని పొందుతున్నారు. ప్రస్తుతం, దేవుని సంఘము సంఖ్య పరంగా ఒక చిన్న సమావేశం. ఇంత తక్కువ సంఖ్యలో పరిచారకులు మరియు భక్తులు మరియు లోకవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న కొద్దిమంది జతపనివారు ద్వారా ఎంత సాధించగలమని కొందరు ప్రశ్నించవచ్చు, కాని ప్రభువు దేవుని సంఘమును స్థిరంగా ఉంచి దాని ద్వారా పని చేస్తున్నందున, ఆయన లోకములోని ప్రతి ఒక్కరినీ దాని పాపములను రక్షిస్తున్నాడు. మన ప్రభువు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారికి జీవాహారమును ఇచ్చాడు.
యేసు తన శరీరమే మన జీవాహారమని చెప్పాడు
మనం పరిశుద్ధమైన బల్లలో పాలుపంచుకున్నప్పుడు, మనం రొట్టె తింటాము మరియు ద్రాక్షారసము తాగుతాము మరియు ఇక్కడ ఉన్న రొట్టె యేసు శరీరాన్ని సూచిస్తుంది, అయితే ద్రాక్షారసము యేసు సిలువపై చిందిన రక్తాన్ని సూచిస్తుంది. ప్రభువు బల్ల మీద ఉన్న రొట్టె మరియు ద్రాక్షారసమును స్వీకరిస్తునప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోమని యేసు చెప్పాడు (లూకా 22:19). ఎందుకు? ఎందుకంటే మన ప్రభువు తన శరీరంతో బాప్తిస్మము పొందడం ద్వారా ఈ లోకములోని అన్ని పాపములను స్వీకరించాడు మరియు మన కోసం సిలువపై తన రక్తాన్ని చిందించాడు. మన ప్రభువు తన బాప్తిస్మము ద్వారా మన పాపములను తన శరీరంపైకి తీసుకున్నందున, అవి యేసుక్రీస్తుకు బదిలీ చేయబడ్డాయి మరియు ఈ విధంగా మన పాపములు శుద్ధిచేయబడతాయి. యేసు తన శరీరాన్ని తిని తన రక్తాన్ని త్రాగమని చెప్పినప్పుడు, ఆయన బాప్తిస్మము ద్వారా మన పాపములను తనపైకి తీసుకున్నాడని, తన రక్తాన్ని చిందించడానికి తన శరీరాన్ని సిలువపై త్యజించి, తిరిగి లేచాడనే సత్యాన్ని విశ్వసించమని చెప్పాడు, మరియు తద్వారా మన పాపములన్నిటినీ ఒక్కసారిగా పోగొట్టాడు. కాబట్టి దీనిని పరిశీలిస్తే, యేసు తన శరీరముతో బాప్తిస్మము పొందడం ద్వారా మన పాపములను మోసుకొని వెళ్లకపోతే ఏమి జరిగేది? మనము మన పాపములను ఎన్నటికీ శుద్ధిచేసుక్కోలేము. అందుకే మనం విశ్వాసం ద్వారా, యేసు శరీరాన్ని భుజించడం ద్వారా మరియు ఆయన రక్తాన్ని త్రాగడం ద్వారా మన పాపముల క్షమాపణను పొందాలి.
మనం మన స్వంత వ్యవహారాలలో చాలా బిజీగా ఉన్నప్పుడు, ప్రభువు మనల్ని పాపం నుండి రక్షించినందుకు మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలో మర్చిపోతాము. మరో మాటలో చెప్పాలంటే, ప్రభువు తన శరీరము మరియు రక్తం ద్వారా మనలను రక్షించినందుకు మనం నిజంగా కృతజ్ఞతతో ఉండవలసి ఉన్నప్పటికీ, మన ఆత్మలు చీకటిలో ఉన్నప్పుడు, మనం ఈ కృపను అనుభవించలేము. మరియు ఫలితంగా, ఎఫెసులో ఉన్న సంఘము దేవుని కోసం అలయక పనిచేసినప్పటికీ మొదటి ప్రేమను కోల్పోయినందుకు మందలించినట్లే, దేవుని పట్ల మరియు ఆయన కృప పట్ల మన కృతజ్ఞతను కోల్పోయాము (ప్రకటన 2:1-4). ఏది ఏమైనప్పటికీ, మనల్ని పట్టి పీడించిన వ్యవహారాల నుండి కొంతకాలం విడిపించుకుని, అన్నింటినీ పక్కనపెట్టి, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని కృప కోసం మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలో మనం గ్రహించవచ్చు. ప్రభువు ఈ భూమిపైకి ఎలా వచ్చాడో, నా పాపములను ఒక్కసారిగా స్వీకరించడానికి ఎలా బాప్తిస్మం తీసుకున్నాడో, సిలువ వేయబడడానికి ఈ పాపములను ఎలా సిలువపైకి తీసుకువెళ్లాడో మరియు వాటి కోసం ఎలా శిక్షించబడి మరణించాడో మరియు ఎలా తిరిగి లేచాడో, ఆయన నన్ను ఎలా పాప విముక్తినిగా చేసాడో అని నేను ఆలోచించినప్పుడు, నేను కృతజ్ఞతతో మునిగిపోయాను. నేను నా పనిలో నిమగ్నమై పోయినప్పుడు, నా ముందు ఉన్నవాటితో నేను చాలా బిజీగా ఉన్నాను, కృతజ్ఞతతో ఉండటానికి నాకు తక్కువ సమయం ఉంది. కానీ, నేను మరోసారి దేవుని ముందు నిలబడినప్పుడు, ఆయన నాలాంటి వ్యక్తిని రక్షించినందుకు నేను చాలా కృతజ్ఞుడను.
ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు శరీరానికి సంబంధించిన ఆలోచనలు తరచుగా మన మనస్సులో కలసిపోయి, మనల్ని గందరగోళంలోకి నెట్టివేస్తాయి. అయితే, దేవుడు మన కోసం చేసిన దాని గురించి మనం ఆలోచించినప్పుడు, మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోతాయి. మనం చాలా అయోగ్యముగా మరియు బలహీనంగా ఉన్నందున, మనమే స్వయంగా దేవుని ముందు పాపరహితులం కాలేమని మరోసారి గుర్తుంచుకోవాలి.
యేసుక్రీస్తు మనలను సృష్టించిన దేవుడు. యేసు మనతో పాటు సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త, అందువలన ఆయన విశ్వానికి యజమాని. దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవజాతి పాపంలో పడి నరకానికి గురైనప్పుడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి కన్య మరియ శరీరం ద్వారా మానవ శరీరంతో ఈ భూమిపై జన్మించిన రక్షకుడు యేసు; ఆయన శరీరంతో బాప్తిస్మము పొందడం ద్వారా లోకములోని పాపములను తీసుకున్నాడు; సిలువపై వారి కోసం శిక్షించబడ్డాడు మరియు మరణించాడు; మృతులలో నుండి తిరిగి లేచాడు; మరియు తద్వారా నిజంగా మరియు పూర్తిగా పాపం నుండి మనల్ని రక్షించాడు. నేను నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి ఆలోచించినప్పుడు నేను దేవునికి తగినంత కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను.
ప్రజలు తమ మరణం మరియు వినాశనం ముందు నిలబడితే, వారు చాలా నిజాయితీగా ఉంటారు. నేను ఈ గంటలోనే చనిపోతానని అనుకుంటే, నేను ఈ లోకములోని అన్ని వ్యవహారాలను పక్కనపెట్టి, దేవునితో నాకున్న సంబంధం గురించి మాత్రమే ఆలోచిస్తాను. మరియు నేను నా తుది శ్వాసలో ఉన్నప్పుడు కూడా, నేను జీవించి ఉన్నప్పుడు యేసు శరీరమును తిన్నందుకు మరియు ఆయన రక్తాన్ని త్రాగినందుకు సంపూర్ణ సమాదానముతో మరియు ఆనందంతో ఉంటాను.
కొంతకాలం క్రితం, ఈస్టర్ ఆదివారం నాడు, మనకు నిత్యజీవాన్ని ఇచ్చినందుకు ప్రభువుకు మళ్లీ కృతజ్ఞతలు చెప్పుకున్నాము. బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొంది, సిలువపై మరణించిన తరువాత, మన ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచి తిరిగి జీవించాడు. ప్రభువు పునరుత్థానం మన స్వంత పునరుత్థానం కాబట్టి, ఆయన సువార్తను విశ్వసించే మీరు మరియు నేను, ప్రభువు మృతులలోనుండి తిరిగి లేచినట్లే, మన శరీరాలు రూపాంతరం చెందుతాయి మరియు మనం కూడా ఎప్పటికీ చనిపోని నూతన శరీరాలతో పునరుత్థానం చేయబడతాము. మరో మాటలో చెప్పాలంటే, ప్రభువు మృతులలోనుండి తిరిగి లేచినట్లే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించిన మనం కూడా మృతులలో నుండి తిరిగి లేస్తాము. నిజానికి, మనము ప్రభువు పునరుత్థానాన్ని విశ్వసిస్తాము మరియు మనం కూడా పునరుత్థానం చెందుతామని విశ్వసిస్తాము.
ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు, క్రొత్తగా జన్మించని పాస్టర్లు కూడా, యేసు సిలువపై మరణించి, సమాధి నుండి తిరిగి లేచాడు కాబట్టి, మీరు కూడా పునరుత్థాన నిరీక్షణతో జీవించాలి
అని బోధిస్తారు. అయితే, ప్రశ్న ఏమిటంటే, వారు నిజంగా యేసు పునరుత్థానాన్ని నమ్ముతున్నారా లేదా అనేది. వేరే విధంగా చెప్పాలంటే, ప్రభువు దినమున తాము పునరుత్థానం చేయబడతామని వారు నిజంగా నిశ్చయించుకున్నారా? వారు ఖచ్చితంగా అలా నిశ్చయించుకోలేదు. అవును, నేను నమ్ముతున్నాను
అని పెదవులతో చెప్పినప్పటికీ, ఇది నిజంగా జరుగుతుందా?
అనే సందేహాలు వారి హృదయాలలో ఉన్నాయి.
నేను క్రొత్తగా జన్మించకముందే, పునరుత్థానం యొక్క అర్థం కూడా నా మనస్సుకు అర్థం కాలేదు. నేను ఇలా ఆశ్చర్యపోయాను, యేసు మరణించిన తర్వాత మళ్లీ ఎలా లేచాడు? చనిపోయిన వ్యక్తి మళ్లీ ఎలా లేవగలడు?
అయితే, తన బాప్తిస్మము ద్వారా లోక పాపములను మోసుకొని వెళ్తున్న ప్రభువు తప్పనిసరిగా సర్వశక్తిమంతుడైన దేవుడే కాబట్టి, ఆయన మృతులలో నుండి తిరిగి లేవడం చాలా సాధ్యమైంది. ప్రభువు మృతులలోనుండి లేచినట్లే మనం కూడా తిరిగి జీవిస్తాము అని చెప్పాడు. ఆయన మనతో ఇలా అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును
(యోహాను 6:54).
అది వాస్తవమైన సత్యం. ఈస్టర్ వచ్చేసరికి, క్రొత్తగా జన్మించని బోధకులు అప్రస్తుతమైన విషయాల గురించి మాట్లాడతారు, అయితే ప్రభువు మనకు నూతన జీవితాన్ని ఇచ్చి మళ్లీ జీవించేలా చేస్తాడని గ్రహించాలి, దీనిని విశ్వసించి, ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువు పనిని నిర్వర్తించిన తర్వాత, మనం తుదకు ఆయన యొద్దకు వెళ్లి సన్నిధిలో నిలబడతాము.
మనం దేవుని ముందు నిలబడితే ఈ శరీరానికి ఏమి జరుగుతుంది? నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారు మళ్లీ జీవిస్తారని నమ్ముతారు. అయితే, ఈ సువార్తను విశ్వసించని వారు మొదటి పునరుత్థానంలో పాల్గొనలేరు (ప్రకటన 20:5-6). నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మి యేసు శరీరమును తినని మరియు ఆయన రక్తాన్ని త్రాగని వారు, యేసు యొక్కయు మరియు వారి యొక్కయు పునరుత్థానాన్ని ఎలా విశ్వసిస్తారు? బాప్తిస్మమిచ్చు యోహాను నుండి బాప్తిస్మము పొందడం ద్వారా యేసు లోకములోని పాపములను తన శరీరంపైకి తీసుకున్నాడని, సిలువపై మరణమగునంతగా రక్తాన్ని చిందించాడని మరియు మృతులలో నుండి తిరిగి లేచాడనే సత్యం వారికి తెలియదు కాబట్టి భవిష్యత్తులో వారు ఖచ్చితంగా పునరుత్థానం చేయబడతారని ప్రజలు తమ హృదయాలతో నమ్మడం అసాధ్యం.
యేసు ప్రాథమికంగా దేవుడే కాబట్టి, ఆయన మానవ శరీరంలో అవతరించి, ఈ భూమిపైకి వచ్చి, మీ పాపములను మరియు నా పాపములను ఒక్కసారిగా తనపైకి తీసుకొని, బాప్తిస్మమిచ్చు యోహాను చేత బాప్తిస్మము పొందడం ద్వారా, సిలువపై మరణించి మరియు తిరిగి మృతులలో నుండి లేవడం ద్వారా మనందరినీ నిజంగా రక్షించగలడు. యేసు కేవలం ఒక మనిషి అయితే, ఇది అసాధ్యం, కానీ ఆయన దేవుడే కాబట్టి ఆయన దీనిని సాధించాడు. దేవుని యొక్క అనేక జీవులలో ఒకడైన మానవుడు ఖచ్చితంగా ఈ లోకములో పాపం లేకుండా జన్మించలేడు. మనుష్యులందరూ పాపులుగా జన్మించారు.
అయితే, యేసు తండ్రి అయిన దేవుని కుమారుడు కాబట్టి, ఆయనే తన వాక్యంతో సమస్త విశ్వాన్ని సృష్టించినవాడు కాబట్టి, మనలను పాపం నుండి రక్షించాలనేది తండ్రి అయిన దేవుని చిత్తం కాబట్టి, క్రీస్తు విధేయతతో ఈ భూమిపైకి వచ్చాడు. తండ్రి యొక్క ఈ చిత్తానికి అనుగుణముగా, మరియు వాస్తవానికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మనలను రక్షించాడు. ఈ సత్యాన్ని విశ్వసించే మనల్ని ఆధ్యాత్మిక మరియు శారీరక మరణం నుండి మన ప్రభువు పునరుత్థానం చేస్తాడు. యేసు మీ రక్షకుడు మరియు నా రక్షకుడు కాబట్టి, ఆయన నిజంగా మన కోసం ఇలా చేసాడు. అందుకే మన హృదయాల్లో దేవునిపై విశ్వాసం మరియు ప్రగాఢమైన కృతజ్ఞత ఉంటుంది.
యేసు దేవుడని మనం గ్రహించి విశ్వసించాలి (1 యోహాను 5:20). యేసు కేవలం ఒక జీవి అయితే, ఎవరూ రక్షింపబడలేరు. ఈ లోకంలో సద్గుణవంతుడు మరియు అత్యంత గౌరవనీయుడు ఎవరైనా మీ పాపములను మరియు నా పాపములను భుజాన వేసుకుని మన కోసం మరణించారని ఇక్కడ అనుకుందాం. అప్పుడు మీరు మరియు నేను నిజంగా రక్షించబడగలమా? లేదు, మణ్ము రక్షించబడము. ఎందుకంటే పాపం చేయని వారు ఎవరూ లేరు, కాబట్టి ఈ వ్యక్తి మన పాపములను భుజాన వేసుకుని మన స్థానంలో చనిపోయినా, అతను ఇతర పాపులను రక్షించలేడు, ఎందుకంటే అతను పాపాత్ముడే కాబట్టి.
సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే మనలను పాపం నుండి రక్షించగలడు కాబట్టి ఆయనే మనలను విడిపించడానికి ఈ భూమిపైకి వచ్చాడు. అందుకే దేవుడైన మన ప్రభువు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా లోకంలోని పాపములను తన శరీరంపైకి తీసుకున్నాడు, తద్వారా మన పాపములను శుద్ధి చేశాడు. యేసు దేవుడే కాబట్టి, ప్రభువు మన పాపముల కోసం శిక్షించబడ్డాడు మరియు మన స్థానంలో సిలువపై మరణించగలిగాడు మరియు ఆయన శక్తి కారణంగా ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆ విధంగా యేసు నిన్ను మరియు నన్ను పాపం నుండి నిజంగా రక్షించాడు. అందుకే ఈ యేసుని నమ్మడం ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాము.
ఈ లోకములో లెక్కలేనన్ని మంది వ్యక్తులు తమ ఆలోచనలకు అనుగుణంగా మతపరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారి మతపరమైన జీవితాలు స్పష్టంగా ఉన్నాయి. నేటి లేఖన వాక్యభాగం ఆధారంగా, వారు ఈ క్రింది విధంగా బోధిస్తున్నారు: "రొట్టె మరియు చేపలు ఇంత అద్భుతంగా రెట్టింపు అవ్వడం ఎలా సాధ్యమైంది? ఇక్కడ, చిన్నవాడు తన చిన్న మధ్యాహ్న భోజనాన్ని యేసుకు నిస్సంకోచంగా అర్పించినప్పుడు, పెద్దలు దీనిని చూసి చలించిపోయి, వారు దాచిన మధ్యాహ్న భోజనాన్ని అందించారు, మరియు ఈ ఆహారాన్ని ఒకచోట చేర్చి, సమానంగా పంచుకోవడంతో, అందరినీ నింపడానికి తగినంత ఆహారం ఉంది. ఇంకా పన్నెండు గంపల ఆహారం మిగిలి ఉంది. కాబట్టి మనం కూడా చిన్న వనరులను